ప్రధాని మోడీ సరికొత్త రికార్డు..!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరో సరికొత్త రికార్డు సృష్టించారు. దేశంలో అత్యధిక కాలంపాటు పదవిలో ఉన్న కాంగ్రెసేతర ప్రధానిగా మోడీ ఘనత సాధించారు. అటల్ బిహారీ వాజ్ పేయి అన్ని దఫాల్లో కలిపి 2268 రోజులు ప్రధాని పదవిలో ఉన్నారు. ఆ రికార్డును ప్రధాని మోడీ అధికమించారు. ఈ విషయంలో మోడీ నాలుగో స్థానంలో ఉన్నారు.  

అంతకు ముందు భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 16ఏళ్ల 286 రోజులు అత్యధిక కాలం పనిచేసి మొదటి స్థానంలో ఉండగా, ఇందిరా గాంధీ 15 ఏళ్ల 350 రోజులు, మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాల 4 రోజులు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వీరి తర్వాత అత్యధిక కాలం పని చేసిన ప్రధానిగా  మోడీ ఘనత సాధించారు. కాగా, నెహ్రూ తర్వాత ఐదేళ్ల పదవీ కాలం పూర్తయిన తర్వాత తిరిగి మరోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టింది మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీలే కావడం విశేషం..

Leave a Comment