Miss Universe 2021: మిస్ యూనివర్స్ గా భారత యువతి.. 21 ఏళ్ల తర్వాత భారత్ కు టైటిల్..!

మిస్ యూనివర్స్ కిరీటాన్ని భారత యువతి హర్నాజ్ కౌర్ సంధూ దక్కించుకుంది. ఇజ్రాయేల్ లోని ఇలాట్ నగరంలో జరిగిన మిస్ యూనివర్స్-21 పోటీల్లో 80 మందితో పోటీపడి హర్నాజ్ సంధూ విజేతగా నిలిచింది. 21 ఏళ్ల తర్వాత భారత్ కు మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. దీంతో ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

కాగా ఇది భారత్ కు మూడో మిస్ యూనివర్స్ కిరీటం.. గతంలో సుస్మితా సేన్(1994), లారా దత్తా(2000)లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. వీరి తర్వాత మిస్ యూనివర్స్ టైటిల్ గెలిచిన మూడో భారత యువతిగా హర్నాజ్ సంధూ నిలిచింది. 

హర్నాజ్ కౌర్ సంధూ 2000 సంవత్సరంలో చంఢీఘర్ లోని పంజాబీ కుటుంబంలో జన్మించింది. మోడలింగ్, వెండితెరపై ఆసక్తితో ఆమె విద్యార్థి దశలోనే ఫ్యాషన్ రంగం వైపు అడుగులు వేసింది. మోడలింగ్ లో రాణిస్తూనే పలు పంజాబీ చిత్రాల్లో కూడా నటించింది. 

 

    

 

Leave a Comment