భార్యపై అనుమానంతో తల నరికి.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు..!

ఉత్తరప్రదేశ్ లో మరో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో  ఓ వ్యక్తి ఆమె తలను నరికాడు. ఆమె తలను తీసుకుని రహదారిపై నడుచుకుంటే వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన యూపీలోని బందా ప్రాంతంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల మేరకు చిన్నార్ యాదవ్, విమలా(35) దంపతులు నేతానగర్ లో నివాసం ఉంటున్నారు. అయితే గత కొంత కాలంగా ఇద్దరు తరుచూ గొడవ పడుతున్నారు. శుక్రవారం ఉదయం కూడా ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. 

మాటకు మాట పెరిగింది. దీంతో చిన్నార్ యాదవ్ సహనం కల్పోయాడు. ఓ పదునైన ఆయుధం తీసుకుని విమలపై దాడి చేశారు. దీంతో విమల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అంతటితో ఆగకుండా ఆమె తలను మొండం నుంచి వేరు చేశాడు. దానిని తీసుకుని రోడ్డు పై నడుచుకుంటూ బబేరు పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

Leave a Comment