ముజఫర్ నగర్ లోని మహాపంచాయతీలో ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. నరేంద్ర మోడీ, యోగి ఆదిత్యనాథ్ ల తలలు నరికేస్తా అంటూ ఓ వ్యక్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు జనాలు అభినందనలు తెలుపుతూ, చప్పట్లు కొడుతూ స్వాగతించారు. ఆ వ్యక్తిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దేశంలో హథ్రాస్ ఘటన సంచనం సృష్టించిన విషయం తెలిసిందే.. రాష్ట్రీయ్ లోక్ దళ్ నాయకుడు జయంత్ చౌదరి హథ్రాస్ బాధితురాలి కుటుంబాన్ని కలవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతడిపై లాఠీ చార్జీ చేశారు. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా మీరట్, బులందర్ షహర్, అలీగఢ్, ముజఫర్ నగర్, బాగ్ పట్, బిజ్నోర్ జిల్లాల్లో భారీగా నిరసనలు వెల్లువెత్తాయి.
ముజఫర్ నగర్ మహా పంచాయతీలోనూ నిరసనలు నిర్వహించారు. ఈ నిరసనల్లో ఓ వ్యక్తి ప్రసంగించాడు. ‘సోదరుల్లారా మనం ఏకం అవుదాం.. మోడీ, యోగిల తలలు నరికి మీ కాళ్ల వద్ద పడేయాలనుకుంటున్నాను’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ మాటలకు అక్కడున్న వారు చప్పట్లు కొట్టారు. ఈ వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Threat to PM CM. Behead them. This all happening before the muzzafarnagar panchayat at Baghpat pic.twitter.com/UnxRdI2ff1
— Anil Tiwari (@Interceptors) October 8, 2020