కేంద్రంపై దీదీ సంచలన ఆరోపణలు

కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయాలు చేయడానికి ఇది సరైన సమయం కాదని మండిపడ్డారు. కరోనా వైరస్ లాక్ డౌన్ పై ప్రధాని మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ కరోనా వైరస్ అంశంపై కేంద్రం రాజకీయాలు చేస్తుందని, రాష్ట్రాల మధ్య వివక్ష చూపుతోందని ఆరోపించారు.  కేంద్ర ప్రభుత్వం స్క్రిప్ట్ ప్రకారం పనిచేస్తుందని, రాజకీయాలు చేయడానికి ఇది సమయం కాదని చెప్పారు. తమ అభిప్రాయాన్ని ఎవరూ అడగరని, సమాఖ్య నిర్మాణాన్ని హింసాత్మకం చేయవద్దని పేర్కొన్నారు. 

‘మేము మీతో సహకరిస్తున్నప్పుడు, మీరు తమపై ఎందుకు దాడి చేస్తున్నారు..ఎల్లప్పుడూ బెంగాల్, బెంగాల్, బెంగాల్ అని అంటారు ఎందుకు..అని ప్రశ్నించారు. 

Leave a Comment