వీడు అసలు మనిషేనా.. ఐదేళ్లలో 75 మందితో పెళ్లి.. 200 మంది యువతులను..!

పేదలు, అమాయక యువతులే అతని టార్గెట్.. బంగ్లాదేశ్ కు చెందిన అమాయకులు, పేదింటి మహిళలను టార్గెట్ చేసుకుని భారత్ లోని ప్రముఖ నగరాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మిస్తాడు. తర్వాత అందంగా ఉన్న అమ్మాయిలను వివాహం చేసుకునేవాడు. అలా గత ఐదేళ్లలో ఏకంగా 75 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఇంకా 200 మంది యువతులను భారత్ లో అక్రమంగా రవాణా చేసి వ్యభిచారంలో దింపాడు.ఇటీవల మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో వెలుగు చూసిన సెక్స్ రాకెట్ కేసులో ఈ సంచలన విషయాలు వెలుగులోని వచ్చాయి. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కేసులో ప్రధాన నిందితుడు మునీర్ బంగ్లాదేశ్ లో నివాసం ఉండేవాడు. భారత్ లో అక్రమంగా వచ్చి, మళ్లీ బంగ్లాదేశ్ వెళ్లేవాడు. మునీర్ చిన్నగా ఈజీ మణి కోసం అమాయక మహిళలు, యువతులను టార్గెట్ చేశాడు. వారిని పెట్టుబడిగా పెట్టి సంపాదించడం మొదలుపెట్టాడు. అలా వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు. 

బంగ్లాదేశ్ కు చెందిన పేదింటి యువతులను, మహిళలను భారత్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించేవాడు. వారిలో అందంగా ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకునేవాడు. అలా 75 మందిని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజులు కాపురం చేసేవాడు. తర్వాత వారిని బంగ్లాదేశ్ నుంచి కోల్ కతాకు తీసుకొచ్చేవాడు. అక్కడ బ్యూటీపార్లర్ లో అందంగా తయారు చేయించి ఎవరితో ఎలా మాట్లాడాలి.. ఎవరితో ఎలా నడుచుకోవాలి.. స్టయిల్ గా బట్టలు వేసుకుని ఎలా ఉండాలి అని పెళ్లి చేసుకున్న అమ్మాయిలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించాడు. ఆ తర్వాత వారిని బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టేవాడు. హైప్రొఫైల్ హోదా ఉన్న వ్యక్తులు వెళ్లే హైటెక్ వేశ్యకేంద్రాల నిర్వాహకులకు వారిని అమ్మేవాడు. 

కాగా 11 నెలల క్రితం ఇండోర్ పోలీసులు విజయనగర్ ప్రాంతంలోని ఓ వేశ్యగృహంపై దాడి నిర్వహించగా.. అక్కడ 21 మంది బంగ్లాదేశ్ అమ్మాయిలు దొరికారు. వారిని విచారిస్తే మునీర్ వ్యవహారం మొత్తం బట్టబయలైంది. అక్కడ దొరికిన 21 మందిలో 12 మంది మునీర్ ని పెళ్లి చేసుకున్న వారే ఉండటంతో పోలీసులు షాక్ అయ్యారు. బంగ్లాదేశ్ మహిళను వివాహం చేసుకున్న మునీర్ ఆమెను విక్రయించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో సూరత్ పోలీసులకు దొరికిపోయాడు. తాను పెళ్లాడిన 75 మందితో పాటు ఇప్పటి వరకు 200 మంది మహిళలను వేశ్యగృహాలకు అమ్మినట్లు పోలీసుల విచారణలో మునీర్ అంగీకరించాడు. 

    

Leave a Comment