కరోనా కలిపింది ఆ ఇద్దరినీ..!

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంటే వారి పాలిట మాత్రం వరంగా మారింది. ఒక్కరిగా కరోనా ఆస్పత్రికి వెళ్ళిన వారిని కలిపి జంటగా మార్చింది. వివరాల్లోకి వెళితే..ప్రకాశం జిల్లా పర్చూరకు చెందిన ఓ యువకుడికి ఇటీవల కరోనా వచ్చింది. దీంతో గుంటూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరాడు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఓ యువతికి ఇటీవల కరోనా సోకింది. ఆమె కూడా అదే ఆస్పత్రిలో చికిత్స కోసం చేరింది.

 అనుకోకుండా వార్డులో వారికి పక్క పక్క బెడ్లు వచ్చాయి. క్వారంటైన్ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. తర్వాత చికిత్స తీసుకున్న ఇద్దరు కరోనా నుంచి కోలుకున్నారు. ఇంటికి వెళ్లి వారి ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు చెప్పి పెళ్లికి ఒప్పించారు. దీంతో పొన్నూరులోని ఓ గుడిలో ఈ జంట జులై 25న పెళ్లి చేసుకుంది. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

Leave a Comment