ఎంటెక్ లో సీటు రాలేదని.. ఆత్మహత్య చేసుకున్న యువకుడు..!

ఎంటెక్ లో సీటు రాలేదని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల మేరకు జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కు చెందిన ఎండీ షఫీ అనే యువకుడు బీటెక్ పూర్తి చేశాడు. ఎంటెక్ లో ప్రవేశం కోసం ఇటీవల ఎంట్రన్స్ పరీక్ష రాశాడు. అయితే షఫీకి సీటు రాలేదు. 

ఇటు ఎంటెక్ సీటు రాకపోవడం.. మరోవైపు ఉద్యోగం దొరక్కపోవడంతో షఫీ మానసికంగా కుంగిపోయాడు. బుధవారం ఉదయం ఇంట్లో బయటకు వెళ్తున్నానని చెప్పి అలుగునూరు శివారులో కాకతీయ కెనాల్ వద్దకు బైక్ పై వెళ్లాడు.

ఆ తర్వాత తన తమ్ముడికి కెనాల్ వద్ద బైక్ ఉందని, వచ్చి తీసుకెళ్లాలని మెసేజ్ పెట్టి ఫోన్ స్విచాఫ్ చేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కెనాల్ వద్దకు చేరుకుని వెతుకుతుండగా బైక్ కనిపించింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కెనాల్ లో వెతికించగా.. షఫీ మృతదేహం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

Leave a Comment