తన పాలనపై జగన్ కే నమ్మకం లేదు..! : కన్నా

గుంటూరు : తన పాలనపై సీఎం జగన్ మోహన్ రెడ్డికే నమ్మకం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్దానిక సంస్థల ఎన్నికలకు అందరు  సిద్దం కావాలన్నారు. జనసేన పొత్తు తో కలసి స్దానిక ఎన్నికలలో పోటీ చేస్తున్నామన్నారు. పురందరేశ్వరి అధ్యక్షతన స్దానిక ఎన్నికలకు కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. జగన్ ప్రభుత్వం నవరత్నాల పేరుతో  చాక్లెట్ ఇచ్చి నెక్లస్ ఎత్తుకుపోతుందని ఎద్దేవ చేశారు. నకిలీ బ్రాండ్లతో మద్యం మీద విపరీతం దోపిడి చేస్తున్నారన్నారు. విద్యుత్ చార్జీలు, పెట్రోల్ ధరలు పెంచుతున్నారని మండిపడ్డారు. త్వరలో రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచబోతున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే ప్రజలపై మోయలేని  భారం మోపారన్నారు. రెండు ప్రాంతీయ పార్టీలు ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకున్నాయన్నారు. 

కేంద్ర ఇచ్చిన నిధుల వల్లే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందన్నారు.  అభివృద్ధి, సంక్షేమం కోసం బిజెపి, జనసేన కూటమి పని చేస్తాయన్నారు.విషపూరిత జీవోల నుంచి జాగ్రత్తగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. అధికార పార్టీ ఆకృత్యాలను ధైర్యంగా ఎదుర్కొని పోటీ చేయాలని పిలుపునిచ్చారు.

Leave a Comment