ఈ సారి ఏకంగా మోడీకి షాకిచ్చిన కంగనా.. ఇది కూడా జీహాదీ అంటూ..!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం వ్యవసాయ చట్టాల గురించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ చట్టాలను రద్దు చేయనున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. ప్రధాని నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.. రైతు నాయకులు, ప్రతిపక్షాలు సైతం ప్రధాని నిర్ణయాన్ని స్వాగతించారు.. 

ప్రధాని నిర్ణయంపై సినీ సెలబ్రెటీలు సైతం స్పందిస్తున్నారు. ఇది అద్భుతమైన విషయమని నటుడు సోనూసూద్ తెలిపారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నందుకు ప్రధాని మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. శాంతియుత నిరసనల ద్వారా తమ డిమాండ్లను పరిష్కరించుకున్న అన్నదాతలకు అభినందనలు తెలిపారు. ఈ రోజు మీ కుటుంబాల దగ్గరికి సంతోషంగా తిరిగి వెళ్తారని ఆశిస్తున్నానంటూ సోనూసూద్ ట్వీట్ చేశారు.  

అయితే బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ మాత్రం దీనికి భిన్నంగా స్పందించారు. స్ట్రీట్ పవర్ గొప్పదని నినూపితమైందని ఓ నెటిజన్ కామెంట్ ని షేర్ చేస్తూ కంగనా విమర్శలు చేశారు. విచారకరం, అవమానకరం, అన్యాయం అంటూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. పార్లమెంట్ ఎన్నుకున్న ప్రభుత్వం కాకుండా వీధిలో ఉన్న ప్రజలు చట్టాలు చేయడం ప్రారంభించినట్లయితే ఇది కూడా జీహాదీ దేశమే అంటే అన్నారు. ఇలా కోరుకునే వారందరికీ అభినందనలు అంటూ వ్యాఖ్యానించారు. 

 

Leave a Comment