బీటెక్ మానేసి.. వందల మంది యువతులతో..!

యువతులు, మహిళలే అతడి టార్గెట్.. సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకొని వారిని ముగ్గులోకి దించుతాడు. తర్వాత నగ్న వీడియో కాల్స్, అసభ్య చాటింగ్ చేయడం చేస్తాడు. చివరికి వాటిని చూపించి వారిని బ్లాక్ మెయిల్ చేస్తాడు.. ఇలా ఒకరిద్దరు కాదు.. తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది యువతులు, మహిళలను మోసగించి భారీగా సొమ్ములు కొల్లగొట్టాడు.. చివరికి పోలీసులకు దొరికి జైలు పాలయ్యాడు. అతడే కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన చెన్నుపల్లి ప్రసన్న కుమార్..

ప్రసన్న కుమార్ (23) బీటెక్ ఫస్ట్ ఇయర్ లో చదువు మానేసి జల్సాలకు అలవాటు పడ్డాడు. జల్సాల కోసం దొంగగా మారాడు. 2017లో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డాడు. ఇళ్లకు కన్నం వేసి డబ్బులు దొంగలించడం చేసేవాడు. దొంగతనాలు చేసి ప్రసన్న కుమార్ పోలీసులకు దొరికిపోయాడు. బెయిల్ పై బయటకు వచ్చి ఇప్పుడు రూటు మార్చాడు. సోషల్ మీడియాలో రోమియో అవతారమెత్తాడు. అమ్మాయిలకు వల వేయడం ప్రారంభించాడు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో యువతులు, మహిళలతో పరిచయం పెంచుకుంటాడు. తర్వాత వారితో నగ్నంగా ఫోన్ కాల్స్ మాట్లాడుతాడు. అసభ్యంగా చాటింగ్ చేస్తాడు. వాటిని చూపించి వారిని బ్లాక్ మెయిల్ చేసి భారీగా డబ్బులు వసూలు చేసేవాడు. కొందర్ని శారీరకంగా లోబరచుకునేవాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వందల మంది యువతులు, మహిళలను ప్రసన్న కుమార్ మోసం చేశాడు. ఈ ఏడాది ఆగస్టు 1న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. శనివారం అతడిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తూ కడప జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. 

 

Leave a Comment