ప్రియుడు మోసం చేయడంతో జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య..!

ప్రేమ పేరుతో టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్ట్ మోసపోయింది. పెళ్లి చేసుకుంటాడని నమ్మి ఆరేళ్ల పాట సహజీవనం చేసింది. మోసం చేసి వేరే యువతితో నిశ్చితార్థం చేసుకోవడంతో బలవన్మరనానికి పాల్పడింది. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కుత్బుల్లాపురం సమీపంలోని గాజుల రామారం ప్రాంతానికి చెందిన కావలి అనురాధ(22) మూడు నెలలుగా కిరణ్ అనే యువకుడితో కలిసి ఫిలింనగర్ లోని జ్ఞానిజైల్ సింగ్ నగర్ లోని ఓ గది అద్దెకు తీసుకొని ఉంటుంది. 

కిరణ్ తో దాదాపు ఆరేళ్లుగా ప్రేమలో ఉంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో అతని సహజీవనం చేస్తుంది. అయితే ఆమెకు తెలియకుండా కిరణ్ మరో యువతితో నిశ్చాతార్థం చేసుకున్నాడు. ఈ మోసాన్ని అనురాధ భరించలేకపోయింది. దీంతో రెండు రోజుల క్రితం తన గదిలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె గది నుంచి మంగళవారం రాత్రి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. పోలీసులు అక్కడికి వెళ్లి గదిలోకి వెళ్లి చూడగా ఫ్యాన్ కు చీరతో వేలాడుతూ కుళ్లిన స్థితిలో అనురాధ మృతదేశం కనిపించింది. మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు కిరణ్ కోసం గాలిస్తున్నారు.    

 

Leave a Comment