పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి ఆర్డినెన్స్ జారీ

రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధిని తగ్గిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి రుజువైతే అనర్హత వేటు పడేలా నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నకల్లో పోటీ చేసే వ్యక్తులు గ్రామాల్లో ఉండేలా, గ్రామాభివృద్ధి, పాలనీ వ్యవహారాల్లో ప్రతి రోజూ పాల్గొనాలని ఆర్డినెన్స్ పేర్కొంది. స్థానిక ఎన్నకల్లో అక్రమాలకు పాల్పడితే గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. లెక్కింపు సమయం మినహా మొత్తం 13 నుంచి 15 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగించేలా ఆర్డినెన్స్ జారీ చేసింది. పంచాయతీ ఎన్నకల్లోె ప్రచార గడువు 5 రోజులుగా, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నకల్లో ప్రచార గడువు 7 రోజులుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Leave a Comment