అనుక్షణం నీ జ్ఞాపకం .. భార్యకు విగ్రహం..!

భార్య చనిపోయినా తన ప్రేమను మాత్రం మరిచిపోయలేకపోయాడు. దీంతో భార్య జ్ఞాపకార్థంగా ఆమె విగ్రహాన్ని తయారు చేయించాడు తమిళనాడుకు చెందిన ఓ వ్యాపారి. తమిళనాడులోని మధురైకి చెందిన సేతారామన్ భార్య పిచ్చై మణియమ్మాల్ నెల క్రితం అనారోగ్యంతో మరణించింది. 48 ఏళ్లుగా భార్య లేకుండా ఒక్క రోజూ గడపని సేతురామన్ ఆమె జ్ఞాపకార్థంగా విగ్రహాన్ని తయారు చేయించాడు. 

ఈ విగ్రహాన్ని ఫైబర్, రబ్బరుతో తయారు చేశారు. ఈ విగ్రహాన్ని చూసినప్పుడు తన భార్య తన కళ్లెదుటే ఉన్నట్లు ఉంటుందని సేతురామన్ చెప్పారు. ఇటీవల కర్ణాటక వ్యాపారవేత్త తన భార్యకు మైనపు విగ్రహాన్ని తయారు చేయించాడు. ఇది చూసి ప్రేరణ పొందిన సేతురామన్ తన భార్యకు చూడా విగ్రహాన్ని తయారు చేయించాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

Leave a Comment