చిలుకూరు వేంకటేేశ్వరస్వామి ఆలయంలో అద్భుతం జరిగింది. ఆలయ ప్రాంగణంలోని సుందరేశ్వర స్వామి సన్నిధిలో తాబేలు ప్రవేశించింది. తెల్లవారుజామున ఆలయ ద్వారాలు తెరిచేసరికి అద్భుతం కనబడింది. శివలింగం పక్కన తాబేలు దర్శనమిచ్చింది. అయితే ఇలా జరగడం కరోనా అంతానికి శుభసూచికమని ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ వెల్లడించారు.
ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆలయ తలుపులు వేసింది వేసినట్లు గానే ఉన్నాయి. ఆదివారం తెల్లవారుజామున ఆలయద్వారం తెరిచినప్పుడు అర్చకులకు శివలింగం పక్కనే తాబేలు కనబడింది. తలుపులు వేసి ఉంటే తాబేలు ఆలయంలోకి ఎలా ప్రవేశించిందని అర్చకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శివయ్యతో తాబేలు ప్రత్యక్షమవడం మహా అద్భుతమని అర్చకులు చెబుతున్నారు. దీంతో శివయ్యతో పాటు తాబేలుకు పూజలు నిర్వహించారు.