న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు.. బహిరంగ పార్టీలకు అనుమతి లేదు..!

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి దేశంలోనూ పెరిగిపోతోంది. కర్ణాటక రాష్ట్రంలోనూ ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతోంది. ఇప్పటి వరకు అక్కడ 19 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది.

 డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు బహిరంగ ప్రదేశాల్లో పార్టీలు, సామూహిక కార్యక్రమాలకు అనుమతి లేదని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై మంగళవారం వెల్లడించారు. పబ్ లు, రెస్టారెంట్లలో 50 శాతం సామర్థ్యంతో న్యూఇయర్ వేడుకలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేశారు. అయితే అక్కడ డీజేలతో పార్టీలు చేసుకునేందుకు అనుమతి లేదన్నారు. ఇక రెండు డోసుల టీకా తీసుకోనివారిని పబ్ లు, రెస్టారెంట్లలోకి అనుమతించకూడదని, అదేవిధంగా అపార్ట్ మెంట్లలోనూ డీజేలను నిషేధిస్తున్నామని వెల్లడించారు. 

Leave a Comment