తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త..

తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త అందించింది. తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగు సమ్మె కాలానికి సంబంధించిన జీతభత్యాలను విడుదల చేసింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగుల సమ్మె కాలానికి రూ.235 కోట్లు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆర్టీసీని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు గతేడాది దాదాపు రెండు నెలలకుపైగా సమ్మె చేశారు. సమ్మెకాలానికి సంబంధించిన జీతభత్యాలను తప్పకుండా చెల్లిస్తామని సీఎం కేసీఆర్ కార్మికులకు హామీ ఇచ్చిరు. ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులకు జీతాలను విడుదల చేస్తూ ఆర్థిక శాక నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. 

Leave a Comment