దిగొచ్చిన పసిడి..

బంగారం ధరలు దిగొస్తున్నాయి. కరోనా ప్రభావంతో స్టాక్ మార్కెట్లు కుదేలవ్వడంతో..వెండి, బంగారం ధరలు దిగొస్తున్నాయి. మొన్నటి వరకు రూ.50 వేలు మార్క్ చేరేలా పరుగులు పెట్టిన గోల్డ్ ధర..ఇప్పుడు వెనక్కి తగ్గింది. కరోనా ప్రభావంతో పసిడి ప్రియులు బంగారం కొనేందుకు సముఖత చూపకపోవడం, మరో వైపు ధరలు కూడా బాగా పెరుగుతుండటంతో.. కొనుగోళ్లు పడిపోయాయి. ఈ క్రమంలో గత రెండు మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అటు అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు పతనమవడం కూడా కలిసొచ్చింది. దీని ప్రభావంతో దేశీ మార్కెట్ లో కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఎంసీఎక్స్ లో బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.534 తగ్గి రూ.39, 710కి చేరింది. మరో వైపు వెండి కూడా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కిలో వెండి కరూ.534 పతనమై రూ.34,882కు చేరింది. 

Leave a Comment