గోల్డ్ మాస్క్..ధర ఎంతో తెలుసా?

కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది. డాక్టర్లు మాత్రం ఎన్-95 మాస్క్ లు వాడాలని సూచిస్తున్నారు. అయితే కొందరు తమ క్రియేటివిటీని చూపిస్తున్నారు. రోజూ రోటీన్ మాస్కులు వాడడటం బోర్ కొట్టిందేమో ఆ బడా బాబుకు..ఏకంగా బంగారంతో మాస్కు చేయించుకున్నాడు. 

మహారాష్ట్రలోని పూణే జిల్లా పింప్రీ చింద్వాడకు చెందిన శంకర్ కురాడే రూ.2.9 లక్షలతో బంగారు మాస్కు తయారు చేయించుకుని వేసుకుంటున్నాడు. ఈ మాస్కు తయారు చేసేందుకు 5.5 తులాల బంగారం వాడినట్లు సమాచారం. ఇక శ్వాస తీసుకోవడానికి  మాస్కుకు చిన్న రంద్రాలు ఉంటాయి. శంకర్ ఇది మాత్రమే కాదు..రోజూ 3 కిలోల బరువు గల బంగారు చైన్, ఉంగరాలు ధరిస్తాడు.  ఇక బంగారు మాస్కు ధరించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు మాత్రం ఎవరికి తోచినట్లు వారు కామెంట్లు పెడుతున్నారు. 

Leave a Comment