జనతా బజార్ల ద్వారా మార్కెట్లో పోటీ పెరుగుతుందని, తద్వారా రైతులకు మేలు జరుగుతుందని సీఎం జగన్ తెలిపారు. జనతా బజార్ల విధివిధానాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ జనతా బజార్లలో ఆక్వా ఉత్పత్తులను విక్రయించేలా చూడాలన్నారు. గ్రేడింగ్, ప్యాకింగ్ దశ కూడా గ్రామస్థాయిలోకి తీసుకెళ్లాలన్నారు.
రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు తగిన స్థాయిలో మార్కెట్ ఈ బజార్ల ద్వారా మార్కెటింగ్ అవకాశాలు లభించాలన్నారు. కరోనా నేపథ్యంలో వికేంద్రీకరించిన బజార్లను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని తెలిపారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉత్పత్తులను ఇక్కడ విక్రయించేలా చూడాలన్నారు. దీనివల్ల రైతులకు, వినియోగదారులకు మేలు జరుగుతుందన్నారు.
మార్కెట్లో ఉత్పత్తులు నిలవాలంటే.. గ్రేడింగ్, ప్యాకింగ్ బాగుండాలని సూచించారు. కనీసం 20–25 ఉత్పత్తులు అందేలా చూడాలన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలతో విధివిధానాలు తయారు చేయాలని సీఎం ఆదేశించారు. మరింత మేథోమథనం చేసి మంచి ప్రతిపాదనలతో రావాలని సూచించారు..