ఏపీలో ఎంట్రన్స్ పరీక్షలు వాయిదా..!

రాష్ట్రంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తురిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఎంసెట్ తో సహా అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాయిదా వేస్తు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సోమవారం ప్రకటించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సీఎం జనగ్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 

అయితే సెప్టెంబర్ మూడో వారంలో ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తామనని తెలిపారు. దీనికి సంబంధంచిన పరీక్ష తేదీలను తర్వలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. జాతీయ ప్రవేశ పరీక్షలకు ఆటంకం కలగకూడదనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. ఆన్ లైన్ కోర్సుల విధివిధానాలను తర్వరలోనే రూపొందిస్తామని మంత్రి వివరించారు.  

Leave a Comment