ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు

500 యూనిట్లకు పైగా వినియోగించే వారిపై భారం

యూనిట్ కు 90 పైసల చొప్పున పెంపు

ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటిచింది. 500 యూనిట్లకు పైబడి వినియోగించే వారికి యూనిట్ కు 90 పైసల చొప్పున పెంచింది. ఇప్పటి వరకు యూనిట్ కు రూ.9.05 ఉన్న ఛార్జీ ప్రస్తుతం రూ.9.95 కి పెరిగింది.

లోటును భర్తీ చేసేందుకే…

ఏపీ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ, దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థలకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.14,349.07కోట్ల ఆదాయం అవసరమవుతుందని, లోటును భర్తీ చేసేందుకే విద్యుత్ ఛార్జీలను పెంచుతున్నామని ఏపీఈఆర్సీ చైర్మన్ సి.వి.నాగార్జున రెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో 9,500 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ ఉందని, అందువల్ల ప్రయివేటు విద్యుత్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలును నిరాకరించామని చెప్పారు. క్రమంగా విద్యుత్ సబ్సిడీని ఉపసంహరించుకునే మార్గాలను అన్వేషిస్తామని తెలిపారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై అభ్యంతరాలు ఉన్న వారు కోర్టులను ఆశ్రయించవచ్చని చెప్పారు.

Leave a Comment