నిత్యావసరాల కోసం ఆందోళన వద్దు : జగన్‌

అమరావతి : కరోనా ప్రభావం నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మార్చి 31వరకు విద్యాసంస్థలు, థియేటర్లు, మాల్స్‌, పెద్ద ప్రార్థనా మందిరాల మూసివేత కొనసాగుతుందని సీఎం జగన్‌ స్పష్టం చే శారు. ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో భాగంగా తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. కరోనా గురించి ప్రజలు ఆందోళన చెందవద్దని.. జాగ్రత్తలు తీసుకోవాలని జగన్‌ సూచించారు. వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ప్రజల్లో అవగాహన పెంచాలని, అపోహలు తొలగించాలని అధికారులను ఆయన ఆదేశించారు.

నిత్యావసర వస్తువుల కోసం ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. కరోనా సాకుతో నిత్యావసరాల ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కలెక్టర్‌ కన్వీనర్‌గా జిల్లాస్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. సామాజిక దూరం అమలుపై తప్పనిసరిగా పర్యవేక్షణ చేయాలని అధికారులకు ఆయన సూచించారు. ఆర్టీసీ బస్సులో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లవద్దని.. బస్సుల్లో శుభ్రత పాటిస్తున్నారా?లేదా? అనేది చూడాలన్నారు. ఆస్పత్రుల్లో పారాసిటమాల్‌, యాంటీబయాటిక్స్‌ సిద్ధంగా ఉంచాలని సీఎం ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖలో సిబ్బందిని సరిగా వాడుకోవాలని. .పీహెచ్‌సీలు, ఆస్పత్రుల్లో కచ్చితంగా సిబ్బంది ఉండేలా చూసుకోవాలన్నారు. హోం ఐసోలేషన్, సామాజిక దూరంపై ప్రధానంగా దృష్టి సారించాలని జగన్‌ దిశానిర్దేశం చేశారు.

 

Leave a Comment