ఉదయ్ కిరణ్ భార్య ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

ప్రస్తుతం ఇండస్ట్రీలో వారసుల ఆధిపత్యమే కొనసాగుతోంది. బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో రాణించడం చాలా కష్టం.. అయితే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో రాణించిన వారు చాలా మంది హీరోలు ఉన్నారు. చిరంజీవి, రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ వంటి హీరోలు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్స్ గా ఎదిగారు.  

ఇలా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు ఉదయ్ కిరణ్.. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. తర్వాత వరుస హిట్లతో యూత్ లో మంచి ఫాలోయింగ్ పెంచుకున్నాడు. 

చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలు బ్లాక్ బస్టర్ అందుకున్నాయి. నువ్వు నేను సినిమా ద్వారా ఉత్తమ నటుడిగా ఫిలిం ఫేర్ అవార్డు కూడా అందుకున్నాడు ఉదయ్ కిరణ్.. ఆ తర్వాత వచ్చిన కలుసుకోవాలని, శ్రీరామ్, నీస్నేహం సినిమాలు కూడా మంచి వసూళ్లు రాబట్టాయి. 

ఇన్ని హిట్ సినిమాలు చేసిన ఉదయ్ కిరణ్ తర్వాత వరుస ఫ్లాపులు అందుకున్నాడు. దీంతో ఉదయ్ కిరణ్ కు అవకాశాలు తగ్గిపోయాయి. అంతేకాదు ఆర్థిక ఇబ్బందులు కూడా వెంటాడాయి. దీంతో ఉదయ్ కిరణ్ మానసికంగా కృంగిపోయాడు. 2014లో ఆత్మహత్య చేసుకుని తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయాడు. 

కాగా ఉదయ్ కిరణ్ 2012లో విషిత కిరణ్ అనే అమ్మాయిని జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు. కెరీర్ పరంగా ఉదయ్ కిరణ్ బాగా డిప్రెషన్ లో ఉండేవాడు. ఆ సమయంలో విషిత మంచి ప్రోత్సాహం ఇచ్చింది. ఉదయ్ కిరణ్ ను మామూలు స్థితికి తీసుకురావడానికి ఎంతో ప్రయత్నించింది. ఎంతో మంది డాక్టర్లను కలిసింది.. అయినా ఉదయ్ కిరణ్ డిప్రెషన్ ను దూరం చేయలేకపోయింది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన విషిత ఆర్థికంగాను ఉదయ్ కిరణ్ ను ఆదుకోవాలని ప్రయత్నాలు చేసింది. కానీ ఉదయ్ కిరణ్ ను మాత్రం దక్కించుకోలేకపోయింది. 

విషిత ఇప్పుడు ఏం చేస్తుంది?

విషిత ఇప్పుడు ఓ ఎమ్ఎన్సీ కంపెనీలో టీం మేనేజర్ గా పనిచేస్తోంది. ఉదయ్ కిరణ్ మరణించి దాదాపు ఏడు సంవత్సరాలు పూర్తవుతున్నా ఆమె మరో పెళ్లి చేసుకోలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆమెకు ఉదయ్ కిరణ్ అంటే ఎంత ఇష్టమో.. ప్రతి నెల తన భర్త పేరిట తన జీతంలో కొంత భాగం అనాధాశ్రమాలకు ఇస్తుందని సమాచారం.. కరోనా కాలంలోనూ ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినట్లు తెలిసింది.. తన భర్త మెమోరీస్ తో, సేవా కార్యక్రమాలు చేస్తూ జీవితం కొనసాగిస్తోంది విషిత కిరణ్.. 

 

Leave a Comment