‘పంజాబీ అమ్మాయికి కడుపు, అబార్షన్.. న్యాయం చేస్తావా పవన్ కళ్యాణ్’ పోసాని సంచలన కామెంట్స్..!

రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్, మంత్రులపై చేసిన వ్యాఖ్యలకు రచయిత, నటుడు పోసాని కృష్ణమురళీ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ పరిశ్రమలోకి ఓ పంజాబీ అమ్మాయి వచ్చిందని, ఆమెకు అవకాశాలు ఇప్పిస్తానని ఓ ప్రముఖుడు మోసం చేశాడని ఆరోపించారు. ఆమెకు కడుపు చేసి, అబార్షన్ చేయించి, ఎవరికీ చెప్పొద్దని బెదిరించి రూ.5 కోట్లు ఇచ్చారని పోసాని తెలిపారు.

అమ్మాయిలపై ఎవరైనా కన్నేస్తే.. కన్ను పీకేస్తానని పవన్ కళ్యాణ్ ఓ సందర్భంలో అన్నారని పోసాని తెలిపారు. ఆ మోసపోయిన పంజాబ్ అమ్మాయి పేరు పవన్ కళ్యాణ్ చెవిలో చెబుతానన్నారు. ప్రశ్నించే గుణం ఉన్న పవన్ కళ్యాణ్ ఆ అమ్మాయికి న్యాయం చేయాలని, ఆ అమ్మాయితో వచ్చి మీడియా ద్వారా న్యాయం చేయాలని అన్నారు. ఆ కేసును సీబీఐకి అప్పగించేలా ప్రయత్నించాలని పోసాని డిమాండ్ చేశారు. ఆ అమ్మాయికి న్యాయం చేస్తే పవన్ కళ్యాణ్ కి గుడి కడతానని చెప్పారు. ఒకవేళ ఆ అమ్మాయికి న్యాయం చేయలేకపోతే.. జగన్ ను, మంత్రులను, ఎమ్మెల్యేలను ప్రశ్నించే హక్కు లేదని తాను అంటానని పోసాని చెప్పారు. 

   

Leave a Comment