అమెరికా చేతిలో కరోనా వ్యాక్సిన్..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణమృదంగం మోగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 10,033కు చేరింది. పాజిటివ్ కేసుల సంఖ్య 2,45,850 మంది కాగా, 87 వేల మంది కోలుకుంటున్నారు. అయితే కరోనా మరణాల్లో ఇటిలీ చైనాను మించి పోయింది. ఇటలీలో కరోనా మరణాల సంఖ్య 3,405, చైనా 3,245, ఇరాన్ 1,284, స్పెయిన్లో 831 ఉన్నారు. అయితే ఇండియాలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. భారత దేశంలో కరోనా పాటిజివ్ కేసులు 174 ఉన్నాయి. రోజురోజుకు విస్తరిస్తోన్న కరోనా వైరస్ ని నివారించేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటన అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. 

కరోనా మహమ్మారి నివారణకు మందులేదు. దీనిని నిరోధించేందుకు ముమ్మర పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ మేరకు అమెరికాలో క్లినికల్ ట్రయల్స్ కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన అన్ని దేశాల్లోనూ ఆసక్తిని కలగచేస్తోంది. కోవిడ్-19కు మలేరియా చికిత్సలో వాడే క్లోరోక్విన్ సమర్థవంతంగా పనిచేస్తోందని ట్రంప్ ప్రకటించారు. దీన్ని కరోనా చికిత్సకు ఉపయోగించేందుకు ఎఫ్ డీఏ ఆమోదం కూడా తెలిపినట్లు ట్రంప్ పేర్కొన్నారు. కరోనా వైరస్ సోకిన చాలా మంది రోగులకు తక్షణమే క్లోరోక్విన్ ను వినియోగించడానికి ఎఫ్ డీఐ ఆమోదించినట్టుగా వెల్లడించారు. ఇప్పటికప్పుడు ఈ ఓషధాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు..ఎఫ్ డీఐ అనుమతి కోసం ఇతర యాంటీవైరల్ ఓషధాలను కూడా గుర్తించనున్నట్లు తెలిపారు.

Leave a Comment