అచ్చెన్నాయుడుకు క‌రోనా పాజిటివ్..!

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు బారిన పడ్డారు. ఈ విషయాన్ని అచ్చెన్నాయుడు తరపు న్యాయవాది వెల్లడించారు. జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్న అచ్చెన్నాయుడుకు స్థానికంగా ఉన్న రమేష్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఈఎస్ఐ స్కాంలో అరెస్టయిన అచ్చెన్నాయుడికి ఇంకా బెయిల్ రాలేదు. 

అచ్చెన్నాయుడుకు బుధవారం ఉదయం నుంచి జలుబు చేయడంలో కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ టెస్టుల్లో ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం అచ్చెన్నాయుడుకు రమేష్‌ ఆస్పత్రి వైద్యులు కరోనా చికిత్స అందిస్తున్నారు. అచ్చెన్నకు పాజిటివ్ రావడంతో కుటుంబీకులు, అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు ఆందోళన చెందుతున్నారు.

Leave a Comment