ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్..!

కరోనా మహమ్మారి ఎవరినీ వదలదు అని సీఎం జగన్ అన్నట్లు ఏపీలో కరోనా ఎవరినీ వదలడం లేదు. అధికారుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు అందరికీ సోకుతుంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం అంజాద్ బాషతో సహా నలుగురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. తాజాగా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన హోం క్వారంటైన్ లో ఉండిపోయారు. 

ఇటీవల ఆయన శ్రీశైలం నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. అనంతరం స్వల్పంగా అస్వస్థత కావడంతో నంద్యాలలోని  స్వగృహంలో విశ్రాంతి తీసుకున్నారు. సందేహం వచ్చి ఆయన నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు జరిపించుకున్నారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో హైదరాబాద్ లో హోం క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని, తనకు ఎవరూ ఫోన్లు చేయవద్దని చక్రపాణిరెడ్డి కోరారు. 

 

.

Leave a Comment