ఏపీలో కరోనా కలకలం.. 16 మంది విద్యార్థులకు పాజిటివ్..!

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కలకలం రేపింది. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ హాస్టల్ లో 16 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. హాస్టల్ లో 200 మంది విద్యార్థులు ఉంటున్నారు. వీరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా.. 16 మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బాజ్జి తెలిపారు. దీంతో కరోనా సోకిన వారిని హాస్టల్ లోనే ఐసోలేషన్ లో ఉంచారు. ఇటీవల ఓ మెడికల్ విద్యార్థి ఢిల్లీలో ఫంక్షన్ కు వెళ్లి వచ్చిన క్రమంలో కరోనా వ్యాప్తి చెందినట్లు అధికారులు గుర్తించారు.

కాగా ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. సోమవారం సాయంత్రం ఏపీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం కొత్తగా 220 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. నలుగురు మృతి చెందారు. 429 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 20,66,670కి చేరింది. 14,377 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.  

 

Leave a Comment