ఏపీలో కరోనా మీద యుద్ధంలో జిల్లా కలెక్టర్లు, కోవిడ్ ఆస్పత్రుల వైద్యులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని సీఎం జగన్ అన్నారు. జిల్లా కలెక్టర్లు, కోవిడ్ ఆస్పత్రుల వైద్యులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్యలు, పారామెడికల్ సిబ్బంది, నర్సులు, పారిశుధ్య సిబ్బంది హృదయపూర్వకంగా సేవలు అందిస్తున్నారని తెలిపారు. లాక్ డౌన్, అంతకుముందు నుంచి వీరు సర్వీసులు అందిస్తున్నారన్నారు.
రాష్ట్రానికి సంబంధించి నాలుగు క్రిటికల్ కేర్ ఆస్పత్రుల్లో ఉత్తమ వైద్య సేవలను అందించడానికి గుర్తించామన్నారు. జిల్లాలోని కోవిడ్ ఆస్పత్రులు, అలాగే క్రిటికల్ ఆస్పత్రుల్లో పని చేస్తున్న వారందరికీ కూడా వైద్యసేవలు అందించే క్రమంలో రిస్కు ఉంటుందని తెలిసినప్పటికీ కూడా కష్టపడి సేవలు చేస్తున్నారని ప్రశంసించారు. అందరూ అంకిత భావంతో రాష్ట్రంలో సేవలు అందిస్తున్నారన్నారు. తెలియని భయం ఉన్నప్పటికీ కూడా మీరు వైద్య సేవలు అందిస్తున్నందుకు తాను సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు.
ఢిల్లీ నుంచి వచ్చిన వారి కారణంగా కేసులు సంఖ్య పెరిగిందని, పూర్తిగా వారందర్నీ ట్రేస్ చేసి వారి ప్రైమరీ కాంటాక్ట్స్ను, సెకండరీ కాంటాక్ట్స్ను పూర్తి క్వారంటైన్ లేదా? ఐసోలేషన్లో పెట్టామని తెలిపారు. మొత్తం మీద చూస్తే పరిస్థితి అదుపులో ఉందనే చెప్పుకోచ్చారు. రాబోయే రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని నమ్ముతున్నాన్నారు. మీరందిస్తున్న సేవలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నానని చెప్పారు.