అమర జవాన్ కు రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించి సీఎం జగన్..!

జమ్మూకశ్మీర్ లోని రాజౌరి జిల్లా సుందర్ బన్ సెక్టార్ లో ఉగ్రమూకలకు, భద్రతా దశాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాదకొత్తపాలెంకు చెందిన జశ్వంత్ రెడ్డి వీర మరణం పొందారు. దేశ రక్షణలో భాగంగా ప్రాణ త్యాగం చేసిన జవాన్ కు సీఎం జగన్ నివాళులర్పించారు. జవాన్ కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ.50 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు..

‘దేశ రక్షణ కోసం కశ్మీర్ లో ప్రాణాలర్పించిన బాపట్లకు చెందిన మన జవాన్ జశ్వంత్ రెడ్డి ధైర్య సాహసాలు, త్యాగం చిరస్మరణీయం. జశ్వంత్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో ఆ కుటుంబానికి అండగా రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది’ అని సీఎం జగన్ ప్రకటించారు.   

 

Leave a Comment