సోషల్ మీడియాలోకి చిరు..

ఉగాది వేళ అభిమానులకు ఓ శుభవార్త ప్రకటించారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి. తను సామాజిక  మాధ్యమాల్లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. ఉగాది సందర్భంగా ఈ కొత్త   నిర్ణయాన్ని తీసుకున్నట్టు మంగళవారం ఓ వీడియో సందేశం ద్వారా తెలిపారు. చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్‌ అధికారిక ట్విటర్‌ ఖాతా ద్వారా ఈ వీడియోని పంచుకున్నారు. ‘‘నా భావాల్ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడానికి, నా సందేశాల్ని ప్రజలతో చెప్పుకోవడానికి సోషల్‌ మీడియాని వేదికగా భావిస్తున్నా. అందుకే ఈ ఉగాది రోజు నుంచే సోషల్‌ మీడియాలోకి ప్రవేశిస్తున్నా’’ అని ఆ వీడియోలో చెప్పారు చిరంజీవి. ఆయన ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తున్నారు. చిరంజీవి కొణిదెల పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా ప్రారంభించగానే లక్షల మంది ఆయన్ని అనుసరించడం మొదలుపెట్టారు.

 

Leave a Comment