ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం వికటించి.. శరీరం కాలిపోయి చిన్నారి మృతి..!

వైద్యం వికటించడంతో శరీరం పూర్తిగా కాలిపోయి చిన్నారి మరణించింది. ఈ ఘటన తిరువళ్లూరు జిల్లా పొన్నేరి సమీపంలో మంగళవారం జరిగింది. వివరామ మేరకు ఎంజీఆర్ నగర్ క చెందిన కుమార్ కుమార్తె లక్షిత(7) గతనెల 27న అనారోగ్యానికి గురైంది. దీంతో ఆ బాలికను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు చికిత్స చేసి మందులు ఇచ్చారు. 

ఆ మందులు వాడిన రెండు రోజుల్లోనే బాలిక శరీరంపై బొబ్బలు వచ్చాయి. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు అదే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇక్కడ వైద్యం అందించలేమని, వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో బాలికను పొన్నేరి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు చెన్నై ఎగ్మూర్ చిన్నపిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. అక్కడ బాలిక చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది. దీంతో బాలిక బంధువులు ప్రైవేట్ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు సర్ది చెప్పి ఆందోళన విరమింపజేశారు. ప్రైవేట్ ఆస్పత్రిపై కేసు నమోదు చేసుకున్నారు.  

Leave a Comment