మీరు ఉచితంగా రూ.15 లక్షలు గెలుచుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఒక కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఆ కాంటెస్ట్ లో పాల్గొని విజేతగా నిలిస్తే రూ.15 లక్షలు తీసుకెళ్లవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
దేశంలో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం డెవలప్ మెంట్ ఫైనాన్షియల్ ఇన్ స్టిట్యూషన్ (DFI) ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనికి పేరు, లోగో, ట్యాగ్ లైన్ రూపొందించాలి. కేంద్ర ప్రభుత్వం ఈ కాంటెస్ట్ కు సంబంధించిన దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఒక్కో కేటగిరిలో ముగ్గురిని విజేతలుగా ప్రకటిస్తారు. పోటీ కోసం దరఖాస్తులు ఆగస్టు 15, 2021 వరకు ఆహ్వానించబడతాయి.
బహుమతి వివరాలు:
కాంటెస్ట్ లో గెలుపొందిన వారికి ప్రతి కేటగిరీలో నగదు బహుమతులు ఇవ్వబడతాయి. పేరు, ట్యాగ్ లైన్, లోగో కోసం ప్రతి కేటగిరీలో మొదటి, రెండవ, మూడవ బహుమతులను కేటాయించారు.
పేరు కోసం:
- మొదటి బహుమతి – రూ.5 లక్షలు
- రెండవ బహుమతి – రూ.3 లక్షలు
- మూడవ బహుమతి – రూ.2 లక్షలు
ట్యాగ్ లైన్ కోసం:
- మొదటి బహుమతి – రూ.5 లక్షలు
- రెండవ బహుమతి – రూ.3 లక్షలు
- మూడవ బహుమతి – రూ.2 లక్షలు
లోగో కోసం:
- మొదటి బహుమతి – రూ.5 లక్షలు
- రెండవ బహుమతి – రూ.3 లక్షలు
- మూడవ బహుమతి – రూ.2 లక్షలు
రిజిస్టర్ చేసుకోవాల్సిన వెబ్ సైట్ : https://www.mygov.in/task/name-tagline-and-logo-contest-development-financial-institution/
Put on your creative hat and stand a chance of winning a cash prize of ₹5,00,000 for each category!
Participate in Name, Tagline and Logo contest for Development Financial Institution.
Visit: https://t.co/VdrHvzPCEb@PMOIndia @FinMinIndia @PIB_India @MIB_India pic.twitter.com/QVlfJ55Y7B
— MyGovIndia (@mygovindia) July 27, 2021