ఆడుకుంటూ రూ.5 నాణెం మింగేసిన బాలుడు..!

ఓ బాలుడు ఆడుకుంటూ రూ.5 నాణెం మింగేశాడు.. ఈ ఘటన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో వెలుగు చూసింది. నెల్లెపల్లెకు చెందిన బాలాజీ, అరుణ దంపతులకు రాకేష్ అనే నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. బుధవారం సాయంత్రం తినుబండారాలు కొనుక్కొనేందుకు రాకేష్ కి తల్లి రూ.5 కాయిన్ ఇచ్చింది. 

తల్లి వద్ద డబ్బులు తీసుకున్న రాకేష్.. తన స్నేహితులతో ఆడుకుంటూ తన వద్ద ఉన్న రూ.5 కాయిన్ ని నోటిలో వేసుకున్నాడు. ఆ నాణెన్ని అలానే మింగేశాడు. దీంతో ఆ కాయిన్ బాలుడి గొంతులో ఇరుక్కుపోయింది. ఇది చూసిన స్థానికులు విషయాన్ని బాలుడి తల్లిదండ్రులకు చెప్పారు. బాలుడి నోటిలో నుంచి నాణెం తీసేందుకు ఎంత ప్రయత్నించినా బయటకు రాలేదు. 

దీంతో వెంటనే చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్యులు ఎవరూ లేరు. అక్కడ ఉన్న సిబ్బంది వారిని వేచి ఉండాలని చెప్పారు. చాలా సమయం వేచి ఉన్న తర్వాత వైద్యులు వచ్చి బాలుడిని పరీక్షించారు. స్కానింగ్ తీయించి.. కాయిన్ తీసేందుకు వీలుకాదని, తిరుపతికి లేదా వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అక్కడి నుంచి వేలూరు సీఎంసీకి తీసుకెళ్లగా.. అక్కడ వైద్యుుల బాలుడి గొంతు నుంచి చాకచక్యంగా నాణెం బయటకు తీశారు. 

 

Leave a Comment