శ్రీశైల క్షేత్రంలో భారీ కుంభకోణం…

అక్రమార్కులు దేవస్థానాలను వదలటం లేదు. భక్తుల సొమ్మును దర్జాగా కాజేస్తున్నారు. తాజాగా శ్రీశైలం క్షేత్రంలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రూ.150ల శీఘ్ర దర్శనం కౌంటర్లో రూ.1.80కోట్లు కాజేశారు. రూ.1500 అభిషేకం టికెట్లలో రూ.50 లక్షలు మాయమయ్యాయి. డొనేషన్స్ కౌంటర్లలో రూ.కోటి అవినీతి జరిగినట్లు సమాచారం. వసతి సదుపాయం కౌంటర్లో రూ.50 లక్షలు అవినీతి జరిగింది.  

టోల్ గేట్ పెట్రోల్ బంకుల నిర్వహణలో మరో రూ.40 లక్షలు, 500 రూపాయల టిక్కెట్లు, కంకణాలు, మహా మంగళహారతి టికెట్లలో మరో 50 లక్షల రూపాయలు దుర్వినియోగం జరిగింది. అవినీతికి పాల్పడ్డ అక్రమార్కులు ఏకంగా సాఫ్ట్‌వేర్‌ నే మార్చేశారు. అభియోగం తమ మీదికి రాకుండా సదరు అక్రమార్కులు టికెట్ కౌంటర్లలో కాంట్రాక్టు ఉద్యోగులను నియమించారు. అయితే.. ఒక్కొక్కటిగా అవినీతి బయట పడడంతో ఒకరిపై ఒకరు ఈవోకు పిటిషన్లు పెట్టుకున్నారు. తీగలాగితే డొంక కదిలిన చందంగా కోట్ల రూపాయల అక్రమాలు బట్టబయలు అవుతున్నాయి. 

 

Leave a Comment