ఐదు రూయాల కోసం గొడవ..కత్తితో దాడి..

ఐదు రూపాయల కోసం హత్య..దీనిని అరవింద సమేత చిత్రంలో ఐదు రూపాయల ఫ్యాక్షన్ గా చూపించాడు దర్శకుడు త్రివిక్రమ్..కాని ఐదు రూపాయల కోసం ఎవరైనా చంపుకుంటారా అనే అనుమానం రావచ్చు..కానీ ఇలాంటి సంఘటనే హర్యానాలో జరిగింది. ఇక్కడ చనిపోలేదు..కానీ గాయపడ్డారు..  

హర్యానాలోని బల్లాబర్గ్ ప్రాంతానికి చెందిన రోహిత్, నిఖిల్ అనే ఇద్దరు వ్యక్తులు కారులో కేర్కిడౌలా టోల్ ప్లాజా వద్ద టోల్ ట్యాక్స్ కట్టారు. అయితే టోల్ గేట్ సిబ్బంది చిల్లర ఇచ్చే క్రమంలో  రూ.5 కాయిన్ కిందపడింది. కాయిన్ చేతికి ఇవ్వాలని వారు కోరారు. 

ఆ విషయంలో ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది. అది కాస్త గొడవగా మారింది. దీంతో రోహిత్, నిఖిల్ లు కారులోంచి దిగి కత్తి తీశారు. అక్కడ టోల్ ప్లాజా మేనేజర్ తో పాటు మరో ఉద్యోగిపై దాడి చేశారు. ఈ దాడిలో మేనేజర్ తీవ్రగా గాయపడ్డాడు. మరో ఉద్యోగికి స్వల్ప గాయాలయ్యాయి. 

స్వల్పంగా గాయపడ్డ ఉద్యోగి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చేలోపే రోహిత్, నిఖిల్ లు అక్కడి నుంచి జారుకున్నారు. అయితే పోలీసులు వారిని వెంబడించి అరెస్టు చేశారు. టోల్ ప్లాజా మేనేజర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. 

Leave a Comment