మరో 17 సంవత్సరాలు జగనే సీఎం.. తేల్చి చెప్పిన ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి..!

ప్రముఖు జ్యోతిష్యుడు వేణు స్వామి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన సోషల్ మీడియాలో ఓ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈసందర్భంగా వేణు స్వామిని హోస్ట్ ఓ ప్రశ్న అడిగారు. ‘ఏపీ సీఎం జగన్ పై ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది..రాష్ట్రంలో ఎలాంటి డెవలెప్ మెంట్ లేదు.. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారు.. సీఎం జగన్ పని అయిపోయిందని ప్రచారం జరుగుతోంది.. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం అవుతారా?’ అంటూ ప్రశ్నించారు.. 

ఈ ప్రశ్నకు వేణు స్వామి ఆసక్తికరంగా సమాధానం చెప్పారు. 2024 కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని చెప్పారు. అయితే ప్రస్తుతం సీఎం జగన్ కు అష్టమ శని నడుస్తోందన్నారు. ఆయన్ని ఎవరు టార్గెట్ చేయాలన్న వారికి కొన్ని నెలలు మాత్రం సమయం ఉందన్నారు. 2022 ఏప్రిల్ 2 నుంచి ఆయన బుధమహర్దశ ప్రారంభమవుతుదన్నారు. ఆ తర్వాత ఆయన్ను ఎవరూ టచ్ కూడా చేయలేరన్నారు. ఆ తర్వాత జగన్ మొత్తం 17 సంవత్సరాలు సీఎంగా చేస్తారని వేణుస్వామి వెల్లడించారు. అంటే ఈ టర్మ్ 5 ఏళ్లు కాకుండా ఇంకా 12 సంవత్సరాలు చేస్తారని చెప్పారు. 

ఇంకా 2022 ఏప్రిల్ తర్వాత దేశంలో రాజకీయంగా చాలా మార్పులు జరగనున్నట్లు వేణుస్వామి స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో రాజకీయపరంగా మార్పులు రాబోతున్నాయన్నారు. చాలా మందికి అది నెగెటివ్ గా ఉండబోతుందన్నారు. అయితే జగన్ కు మాత్రం 2022 ఏప్రిల్ తర్వాత పాజిటివ్ వైపు వెళ్తున్నట్లు వేణుస్వామి చెప్పారు. అయితే వేణుస్వామి జాతకం ఎంత వరకు నిజం అవుతుందో తెలియాలంటే 2024 వరకు ఆగాల్సిందే.. 

Leave a Comment