ఈనెల 16 నుంచి ఏపీ అసెంబ్లీ..

ఈనెల 16 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు నోటిఫికేషన్ ను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విడుదల చేశారు. ఈనెల 16న ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. 

ఈ సమావేశాల్లో ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని ఇతర సమస్యలపై ఏయే అంశాలపై చర్చించే సమయాన్ని శాసనసభ వ్యవహారాల కమిటీ నిర్ణయం తీసుకుంటుంది.గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడ్డాక బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం అవుతుంది.  ఈనెల 19న రాజ్యసభ ఎన్నికలు జరుతాయి. కాబట్టి బడ్జెట్ సమావేశాలు కలిసొచ్చేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది.

 

Leave a Comment