కొత్త జంటకు ఆంజనేయస్వామి ఆశీర్వాదం..!

తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా మంగపేట మండలం హేమాచల నరసింహస్వామి ఆలయంలో ఓ విచిత్ర సంఘటన శుక్రవారం జరిగింది. బంధు, మిత్రులు, సన్నిహితుల మధ్య ఓ వివాహ తంతు జరుగుతోంది. వధూవరులు ఇద్దరు ఒకరికొకరు తలంబ్రాలు పోసుకుంటున్నారు. ఇంతలో ఓ కోతి అనుకోని అతిథిలా వచ్చి వధూవరుల తలపై దూకింది. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారు కంగారు పడ్డారు. 

వధూవరులు కూడా తమ తలపై కోతి దూకడంతో భయాందోళనకు గురయ్యారు. ఆ తర్వాత దైవసన్నిధిలో జరుగుతున్న తమ పెళ్లి వేడుకకు సాక్షాత్తు ఆంజనేయస్వామి వచ్చి ఆశీర్వదించాడని బావించారు. పెళ్లి తంతులో భాగంగా ఫొటోలు తీస్తుండగా ఈ కెమెరాకు చిక్కింది. కొత్త జంటకు కోతి ఆశీర్వదిస్తున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

Leave a Comment