‘ఏపీ రాజధాని’ వివాదంపై క్షమాపణాలు చెప్పిన యాంకర్ ప్రదీప్..!

ఓ టీవీ ప్రోగ్రాంలో యాంకర్ ప్రదీప్ ‘ఏపీ రాజధాని విశాఖ’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ విషయంపై అమరావతి పరిరక్షణ సమితీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో ఉన్న అంశాలను యాంకర్ ప్రదీప్ ఎలా మాట్లాడతారని, తన వ్యాక్యలను ఉపసంహరించుకుని ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. 

ఈ వివాదంపై యాంకర్ ప్రదీప్ స్పందించారు. తస సందేశంలో కూడిన ఓ వీడియోను విడుదల చేశారు. తన వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటు మనస్ఫూర్తిగా క్షమించాలని కోరారు. తాను ఉద్దేశపూర్వకంగా ఎవరినీ నొప్పించలేదని, ఎవరినీ కించపర్చాలని ఈ విధంగా చేయలేదని స్పష్టం చేశారు. 

రాష్ట్రం, రాజధాని అనే అంశంపై టీవీ షోలో ప్రశ్నలు అడుగుతుండగా ఆ అంశం తప్పుదారి పట్టిందని పేర్కొన్నారు. వాస్తవానికి ఇలాంటి అంశాలకు తాను దూరంగా ఉంటానని చెప్పారు. ప్రేక్షకులకు వినోదం అందించడమే తన ప్రాధాన్యత అని ప్రదీప్ వెల్లడించారు. అందుకు మీ ఆశీస్సులు కావాలని కోరారు. 

 

Leave a Comment