ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా?

అలనాటి అందాల హీరోయిన్ రక్షిత.. ఇడియట్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్టీఆర్, మహేష్ బాబు, నాగార్జున వంటి బడా హీరోలతో నటించింది. అదే సమయంలో కన్నడలో కూడా నటించి స్టార్ ఈమేజ్ తెచ్చుకుంది. తర్వాత ఓ కన్నడ దర్శకుడిని పెళ్లి చేసుకొని సినిమాలకు ముగింపు పలికింది. ఒకప్పుడు కుర్రాళ్లకు కలలరాణిగా వెలిగిన రక్షిత ఇప్పుడు ఎలా చేస్తుందంటే..

రక్షిత అసలు పేరు శ్వేత.. ఈమె బెంగళూరులో పుట్టిపెరిగింది. ఆమె తండ్రి బీసీ గౌరీశంకర్ కొరియోగ్రాఫర్, తల్లి మమతా రావు కన్నడ నటి. తల్లిదండ్రులు ఇద్దరూ ఇండస్ట్రీలో ఉండటంతో రక్షిత సినిమా ఎంట్రీ సులువైంది. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో పునీత్ రాజ్ కుమార్ సరసన అప్పు అనే కన్నడ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.  ఆ తర్వాత ఆమెకు అవకాశాలు తలుపు తట్టాయి.

ఆ తర్వాత 2007లో కన్నడ దర్శకుడు ప్రేమ్ ను పెళ్లి చేసుకుంది. తర్వతా నటను గుడ్ పై చెప్పేసింది. ఓ బాబుకు జన్మనిచ్చిన తర్వాత రక్షిత బరువు పెరిగి ఎవరూ గుర్తుపట్టని విధంగా మారిపోయింది. థారాయిడ్ కారణంగానే బరువు పెరిగినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. రక్షిత షాకింగ్ లుక్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.     

రక్షిత ప్రస్తుతం పలు కన్నడ షోలకు జడ్జిగా వ్యవహిరస్తోంది. అంతేకాదు ఏక్ లవ్ యూ అనే సినిమాను కూడా నిర్మిస్తోంది. దశాబ్ద కాలం తర్వాత ఈ సినిమాలో అతిథి పాత్ర ద్వారా కెమెరా ముందు నటిస్తోంది. గతంలో రెండు పార్టీలు మారిన ఆమె ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతోంది.  

Leave a Comment