పరిటాల కుటుంబంలో మరో తరానికి వారసుడు వచ్చాడు. మాజీ మంత్రి పరిటాల సునీతా కొడుకు పరిటాల శ్రీరామ్ తండ్రి అయ్యాడు. తమ కుటుంబంలో మరో వ్యక్తి రావడంతో పరిటాల కుటుంబంలో పండుగ వాతావరణ నెలకొంది. ప్రస్తుతం తల్లి, బిడ్డా క్షేమంగా ఉన్నారు. మరో వైపు పరిటాల శ్రీరామ్ ను టీడీపీ అధికార ప్రతినిధిగా నియమించారు.
దీంతో అటు తండ్రిగా, ఇటు పార్టీలో శ్రీరామ్ కు డబుల్ ప్రమోషన్ దక్కిందని తెలుగు తమ్ముళ్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పరిటాల రవి మళ్లీ పుట్టాడంటూ అభిమానులు సంబరపడిపోతున్నారు. తనకు కొడుకు పుట్టాడనే విషయాన్ని పరిటాల శ్రీరామ్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు.
It gives us immense joy to announce the arrival of our Son.
-Paritala Sreeram,Gnana. pic.twitter.com/EA1XD9gM6T— Paritala Sreeram (@IParitalaSriram) November 6, 2020