మతాల పేరుతో ఇండియాలో జరిగే రచ్చ తెలియనది కాదు. చాలా మంది మతంపేరుతో ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఇలా మతాల పేరుతో రచ్చ చేసే కొందరికి కనువిప్పు కలిగించేలా చేశారు ఒక ముస్లిం వ్యాపారి. హనుమంతుడి ఆలయం కోసం ఖరీదైన తన స్థలాన్ని విరాళంగా ఇచ్చి మతసామరస్యాన్ని చాటుకున్నాడు.
బెంగళూరులో లారీ ట్రాన్స్ పోర్ట్ బిజినెస్ చేస్తున్న హెచ్ఎంజీ బాషా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. వలగెరెపుర గ్రామంలో హనుమాన్ దేవాలయం పక్కనే ఆయనకు కొంత స్థలం ఉంది. హనుమాన్ గుడి చిన్నది కావడంతో భక్తులు ప్రదక్షిణలు చేయడానికి వీలు కావడం లేదు.
దీంతో బాషా గుడి పక్కన ఉన్న తన 180 గజాల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. మొదట ఆ గ్రామం వారు బాషా మాటలను నమ్మలేదు. అయితే బాషా కాగితాలు కూడా రెడీ చేయించడంతో ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. బాషా గుడి కోసం ఇచ్చిన స్థలం ఖరీదు రూ.80 లక్షలు ఉంటుంది. దీంతో వలెగెరెపుర గ్రామస్థులు బాషా, ఆయన భార్య ఫొటో పెట్టి గుడి పక్కనే ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
Karnataka: HMG Basha, a resident of Kadugodi in Bengaluru donated land for construction of a Hanuman Temple in Mylapura.
He says, “I used to see many people struggle while offering prayers as the temple is small. So, I decided to donate a part of my plot of land.” pic.twitter.com/JaxR2DJaAv
— ANI (@ANI) December 8, 2020