కరోనా వైరస్ లాంటి విపరీత పరిస్థితుల్లో ఏం చేయాలనే దానిపై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ 6 గోల్డెన్ రూల్స్ గురించి ట్విట్ చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని, కరోనా నుంచి కాపాడుకోవాలని చెప్పాడు. ‘ఈ అనుకోని పరిస్థితుల్లో ఈ ఆరు గోల్డెన్ రూల్స్ పాటించాలని నేను కోరుతున్నాను. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన సూచనలు పాటించాలి’ అని చెప్పాడు.
మహేశ్ బాబు చెప్పిన ఆరు గోల్డెన్ రూల్స్..
- మొదటిది, చాలా ముఖ్యమైనది ఏంటంటే ఇంట్లోనే ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయట అడుగుపెట్టాలి.
- 20 నుంచి 30 క్షణాల పాటు రోజులో చాలా సార్లు సబ్బు, నీళ్లతో మీ చేతులు కడుక్కోండి.
- మీ ముఖాన్ని తాకకండి. ముఖ్యంగా కళ్లు, నోరు, ముక్కును తాకకండి.
- దగ్గుతున్నప్పుడు, తుమ్ముతున్నప్పుడు మీ మోచేతులను లేక టిష్యూను అడ్డుగా పెట్టుకోండి.
- సామాజిక దూరం అవసరాన్ని అర్థం చేసుకోండి. ఇంట్లో, బయట ఇతరులకు కనీసం మూడు మీటర్ల దూరం ఉండండి.
- మీకు కరోనా లక్షణాలు లేక అనారోగ్యం ఉంటే మాత్రమే మాస్క్ ని వాడండి. మీకు కొవిడ్-19 లక్షణాలు ఉంటే దయచేసి డాక్టర్ని సంప్రదించండి.
మంచి సోర్సు నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మండి. కరోనాపై అందరితో కలిసి పోరాడి జయిద్దాం