బీసీలకు రిజర్వేషన్లు తగ్గిస్తే ఊరుకోం: అచ్చెన్న

అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజ్వరేషన్లపై వైసీపీ అవాస్తవాలు చెబుతోందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా టీడీపీ కేసు వేసిందని మంత్రి బొత్స తప్పుడు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. వైసీపీ నేత సుప్రీంకోర్టుకు వెళ్తే… టీడీపీపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. హైకోర్టు 59.07శాతం రిజర్వేషన్లు ఇస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. న్యాయస్థానం చెప్పిందని బీసీల రిజర్వేషన్ తగ్గిస్తే మాత్రం ఒప్పుకునేది లేదన్నారు. అవసరమైతే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో టీడీపీకి అండగా ఉన్న వర్గాలు బీసీలేనన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. వైసీపీ 9 నెలల పాలనలో బలహీన వర్గాలకు రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని ఆరోపించారు. కాపు నేస్తం ఇవ్వడంలో తప్పు లేదు కానీ.. అలాగే బీసీలకు కూడా పథకాలు వర్తింపజేయాలని అచ్చెన్నాయుడు కోరారు.

 

Leave a Comment