ఏడుస్తున్నాడని మూతికి వాత పెట్టిన అంగన్ వాడీ ఆయా..!

మూడేళ్ల చిన్నారి పట్ట ఓ అంగన్ వాడీ కేంద్రం సహాయకురాలు దారుణంగా ప్రవర్తించింది. ఏడుస్తున్నాడని మూతికి వాత పెట్టింది. ఈ ఘటన అనంతపురంలో గురువారం జరిగింది. వివరాల ప్రకారం.. పట్టణంలోని కోవూరునగర్ అంగన్ వాడీ కేంద్రంలో లక్ష్మీ అనే మహిళ తన మూడేళ్ల కుమారుడు ఈశ్వర్ క్రిష్ణను వదిలిపెట్టింది.

కొద్ది సేపటికి ఆ బుడ్డోడు అమ్మ కావాలి అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. దీంతో అంగన్ వాడీ కేంద్రం సహాయకురాలికి కోపం వచ్చింది. వెంటనే ఆ పసివాడిని వంట గదిలోకి తీసుకెళ్లి కడ్డీతో మూతి మీద వాత పెట్టింది. బాధతో ఆ పసివాడు విలవిల్లాడాడు. ఏడుస్తూనే అంగన్ వాడీ కేంద్రం నుంచి సమీపంలోని తన ఇంటికి పరిగెత్తాడు.. 

అయినా ఆయా ఆ చిన్నారిని వదల్లేదు.  వెంట పడి పట్టుకుని ఓ చెట్టు కొమ్మతో కొట్టుకుంటూ మళ్లీ కేంద్రానికి తీసుకొచ్చింది. మూతి మీద వాత చూసిన బాలుడి తండ్రి విషయం తెలుసుకొని అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లి ఆయాను ప్రశ్నించాడు. ఆయా మాత్రం సరైన సమాధానం చెప్పలేదు. పైగా బాలుడి తండ్రిపైనే ఎదురుతిరిగింది. 

 

 

Leave a Comment