ప్రేమ పెళ్లి చేసుకుందని.. కూతురు బతికుండగానే పిండం పెట్టిన తండ్రి..!

ఈరోజుల్లో చాలా మంది ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. కానీ కొంతమంది తల్లిదండ్రులు ప్రేమ వివహాలను అంగీకరిస్తే.. చాలా మంది ప్రేమ వివాహాలను అంగీకరించరు. కొంతమంది పిల్లలు కూడా పెళ్లి విషయంలో తల్లిదండ్రుల ఇష్టాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. అయితే ఓ తండ్రికి మాత్రం కూతురు ప్రేమ పెళ్లి చేసుకోవడం నచ్చలేదు. దీంతో ఆ తండ్రి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కూతురు ప్రేమ వివాహం చేసుకుందని ఆమె బతికి ఉండగానే పిండం పెట్టాడు. గుండు గీయించుకుని దినకర్మలు కూడా నిర్వహించాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ లో జరిగింది.  

మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం మద్దూరు గ్రామానికి చెందిన భార్గవి అదే ప్రాంతానికి చెందిన వెంకటేష్ ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం పెద్దలను ఒప్పించేందుకు ప్రయత్నించారు. కానీ వారు ఒప్పుకోలేదు. అయితే ఒకరినొకరు విడిపోవడం ఇష్టం లేక పెద్దలను ఎదిరించి ఈనెల 13న ఒక ఆలయంలో పెళ్లి చేసుకునారు. 

అంతే తనకు ఇష్టం లేకపోయినా వినకుండా కూతురు ప్రేమపెళ్లి చేసుకోవడంతో తండ్రికి కోపం వచ్చింది. దీంతో కూతురుకు తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు. తన కూతురు చనిపోయిందని అంటూ గుండు గీయించుకున్నాడు. ఆమెకు కర్మకాండలు కూడా జరిపించాడు. దీని కోసం ఫ్లెక్సీలు కూడా ముద్రించాడు. కూతురు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించాడు. ఫ్లెక్సీలో కీ.శే.కమ్మరి భార్గవి జననం.. మరణం అంటూ పెళ్లి చేసుకున్న తేదీని మరణించినట్లుగా వేసి మరీ నివాళులర్పించాడు. ప్రస్తుతం ఈవార్త చర్చనీయాంశంగా మారింది.  

Leave a Comment