ఆర్టీసీ బస్సులో రూ.10 కోడిపిల్లకు రూ.50 టికెట్..!

సాధారణంగా ఆర్టీసీ బస్సులో ఎక్స్ ట్రా లగేజీ తీసుకెళ్లినప్పుడు కండక్టర్ అదనపు ఛార్జీలు వసూలు చేస్తాడు. కానీ కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సులో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ కోడిపిల్లకు కండక్టర్ టికెట్ తీసుకున్నాడు. సిద్ధపుర నుంచి ఓ సంచార కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు రూ.10 చెల్లించి కోడిపిల్లను కోనుగోలు చేశారు.

ఆ కోడి పిల్లను తీసుకుని హోసనగర వద్ద కేఎస్ ఆర్టీసీ బస్సు ఎక్కారు. బస్సులో టికెట్లు కొడుతున్న కండక్టర్ కోడిపిల్లకు కూడా టికెట్ తీసుకోవాలని డిమాండ్ చేశాడు. బస్సులో కోడిపిల్లకు టికెట్ తీసుకోవాలని నిబంధన ఉందని చెప్పాడు. దీంతో వారు చేసేది లేక ఓ కోడిపిల్లకు హాఫ్ టికెట్ తీసుకున్నారు. రూ.10తో కొనుగోలు చేసిన కోడిపిల్లకు తీసుకెళ్లేందుకు ఆ కుటుంబానికి రూ.50 చెల్లించాల్సి వచ్చింది.   

 

Leave a Comment