చికిత్స చేస్తుండగా.. పేషంట్, డాక్టర్.. ఇద్దరికీ ఒకేసారి గుండెపోటు..!

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. హార్ట్ ఎటాక్ వచ్చిన రోగికి చికిత్స చేస్తుండగా.. డాక్టర్ కి గుండెపోటు వచ్చింది. ఈ ఘటనలో రోగి, డాక్టర్ ఇద్దరూ మృతిచెందారు.

వివరాల మేరకు కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుజ్జల్ తండాకు చెందిన ఓ వ్యక్తికి ఆదివారం హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో ఆ వ్యక్తిని గాంధారిలోని డాక్టర్ లక్ష్మణ్ కి చెందిన నర్సింగ్ హోమ్ కి తరలించారు. 

నర్సింగ్ హోమ్ లో పేషంట్ కి ట్రీట్మెంట్ చేస్తుండగా.. వైద్యుడికి కూడా గుండెపోటు వచ్చింది. దీంతో వైద్యుడు లక్ష్మణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రోగిని కామారెడ్డికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. 

Leave a Comment